మయన్మార్‌లో ఘోర విమాన ప్రమాదం.. 12 మంది మృతి

by  |
మయన్మార్‌లో ఘోర విమాన ప్రమాదం.. 12 మంది మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: మయన్మార్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకొంది. ఈ ఘటన లో 12 మంది మృతిచెందగా.. మరో నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. గురువారం మయన్మార్ రాజధాని నేపిడా నుంచి మిలటరీ విమానం 16 మంది ప్రయాణికులతో పియన్‌వూ ల్విన్‌కు బయలుదేరింది. ఆకాశానికి ఎగిరిన కొద్దీ సమయంలోనే అదుపుతప్పిన విమానం మాండలే నగరంలో స్టీల్ ప్లాంట్‌ సమీపంలో కుప్పకూలింది. దాదాపు 984 ఫీట్ల ఎత్తు నుంచి విమానం కిందపడినట్లు అధికారులు తెలుపుతున్నారు. ఈ ఘటనలో విమానంలో ఉన్న 12 మంది మరణించగా.. ప్రమాదం నుండి విమాన పైలట్‌తో పాటు ఓ ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడినట్లు తెలుస్తోంది. విమానంలో ఉన్నవారంతా సాధువులని, వారంతా ఓ భౌద్ద మఠానికి వెళ్లాల్సి ఉందని.. అంతలోనే ఈ ఘోరం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. ఇక ఈ ప్రమాదానికి కారణం.. వాతావరణం సరిగ్గా లేకపోవడమేనని అధికారులు అనుమానిస్తున్నారు.


Next Story

Most Viewed