కోదాడలో ఘోర ప్రమాదం.. భార్యభర్తలు స్పాట్ డెడ్

by  |
road accident
X

దిశ, కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భార్యభర్తలు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. కోదాడ పట్టణంలోని సాలార్జంగ్ పేటకు చెందిన షేక్ సర్దార్(40), భార్య నస్రత్ ఫాతిమా(33) గుడిబండ గ్రామంలోని తమ అత్తగారింటికి బైకుపై వెళుతున్నారు. బైపాస్ రహదారిలోని గుడిబండ గ్రామ శివారు ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్దకు రాగానే హైదరాబాద్ నుంచి వస్తోన్న వెనుక నుండి వీరిని ఢీ కొట్టింది. దీంతో షేక్ సర్దార్ దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతిచెందిన దంపతులకు ఒక బాబు, ఒక పాప ఉన్నారు. కాగా, విషయం తెలిసిన వెంటనే ‘దిశ’ దిపోర్టర్ ఘటనా స్థలికి చేరుకొని స్వయంగా తానే ఆటో డ్రైవింగ్ చేస్తూ.. మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.



Next Story

Most Viewed