విషాదం.. హాస్టల్‌లో ఉరి వేసుకుని టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య

by  |
10th-Student1
X

దిశ‌, హ‌న్మకొండ టౌన్: హ‌న్మకొండ జిల్లా కేంద్రంలోని కుమార్ పల్లి తోటబడిలో పదవతరగతి చదువుతున్న మాదాసి రశ్మిత హాస్టల్ రూమ్ లో ఉరివేసుకోని ఆత్మహ‌త్యకు పాల్పడింది. ఈ సంఘ‌ట‌న బుధ‌వారం సాయంత్రం చోటు చేసుకుంది. విద్యార్థిని ఆత్మహ‌త్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు పాఠ‌శాల‌కు చేరుకుని వివ‌రాలు సేక‌రిస్తున్నారు. ఇదిలా ఉండ‌గా విద్యార్థిని ఆత్మహ‌త్యపై అనుమానాలున్నాయంటూ విద్యార్థి సంఘాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. స‌మ‌గ్రమైన విచార‌ణ చేప‌ట్టాల‌ని డిమాండ్ చేస్తున్నాయి. ఇదే విష‌యంపై సీఐ వేణుమాధ‌వ్ వివ‌ర‌ణ కోసం దిశ రిపోర్టర్ ఫోన్‌లో ప్రయ‌త్నించ‌గా అందుబాటులోకి రాలేదు.



Next Story

Most Viewed