AP News : ఏపీలో టెన్త్ పరీక్షలు వాయిదా

by  |
AP News : ఏపీలో టెన్త్ పరీక్షలు వాయిదా
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా నేపథ్యంలో ఏపీలో పదో తరగతి పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. జులైలో పరీక్షలపై ప్రభుత్వం మళ్లీ సమీక్షించి నిర్ణయం తీసుకోనుంది. ఇవాళ టెన్త్ పరీక్షలపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విషయాన్ని హైకోర్టుకు కూడా ప్రభుత్వం తెలియజేసింది. ఈ సందర్భంగా పరీక్షలు వాయిదా వేయడానికి సంబంధించి లిఖిత పూర్వకంగా తెలపాలని హైకోర్టు ఆదేశించింది. అలాగే స్కూల్స్ తెరిచే ఆలోచన కూడా లేదని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది.

కాగా ఏపీలో టెన్త్ పరీక్షలను రద్దు చేసి ఇంటర్నల్ మార్కుల ఆధారంగా మార్కులు ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లో చేసినట్లు ఏపీలోనూ టెన్త్, పరీక్షలను రద్దు చేయాలని కోరుతున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం ఇంకా దీనిపై నిర్ణయం తీసుకోలేదు.

Next Story

Most Viewed