జూన్ 7నుంచి టెన్త్ పరీక్షలు

by  |
జూన్ 7నుంచి టెన్త్ పరీక్షలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల షెడ్యూలు విడుదల అయ్యింది. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ బుధవారం మీడియా సమావేశంలో పరీక్షల షెడ్యూలును ప్రకటించారు. జూన్ 7 నుంచి 16వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని, మొత్తం 7 పేపర్లకు పరీక్షలు ఉంటాయన్నారు. సైన్స్‌లో రెండు పేపర్లు ఉంటాయని పేర్కొన్న మంత్రి సురేశ్… జూన్ 7న ఫస్ట్ లాంగ్వేజ్, 8న సెకండ్ లాంగ్వేజ్, 9న ఇంగ్లీష్, 10న గణితం, 11న భౌతిక శాస్త్రం, 12న జీవశాస్త్రం, 14న సోషల్ పరీక్షలు ఉంటాయన్నారు. రాష్ట్రంలో జులై 21న నుంచి కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమవుతుందని తెలిపారు. మే 5నుంచి 23వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు.



Next Story

Most Viewed