హుజూరాబాద్ లో టెన్షన్.. టెన్షన్

by  |
Tension-in-Huzurabad1
X

దిశ, హుజూరాబాద్ రూరల్: దళితబంధు స్కీం అమలును ఎన్నికల కమిషన్ తాత్కాలికంగా నిలిపివేయడంతో హుజూరాబాద్ లో అర్థరాత్రి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. టీఆర్ఎస్ నాయకులు ఈటల దిష్టిబొమ్మను దగ్ధం చేయడంతో బీజేపీ శ్రేణులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు వారు ప్రయత్నించగా టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నారు. చివరకు సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మను వారు దగ్ధం చేశారు. ఈ నేపథ్యంలో అర్థరాత్రి హుజూరాబాద్ లో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీస్ బలగాలు భారీగా మోహరించాయి.

Next Story