బాన్సువాడలో టెన్షన్.. టెన్షన్.. పోలీసుల భారీ బందోబస్త్

by  |
bansawada
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : గోవుల అక్రమ రవాణా అడ్డుకునే విషయంలో జరిగిన ఘర్షణను నిరసిస్తూ బీజేపీ, హిందూధర్మ కార్యకర్తలు శుక్రవారం బాన్సువాడ బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో గోవులను అక్రమ రవాణా చేసిన వ్యక్తులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ బాన్సువాడ పట్టణ బంద్ నిర్వహిస్తున్నారు.

బంద్ సందర్భంగా బాన్సువాడ డీఎస్పీ.. ఏడుగురు సీఐలు, 40 మంది ఎస్‌ఐలు, 300 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే, బంద్‌కు పిలుపు ఇవ్వడంతో ఇప్పటి వరకు 30 మంది బీజేపీ, హిందూధర్మ పరిరక్షణ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి, నిజాంసాగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఎక్కడికక్కడ బీజేపీ, హిందూధర్మ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు.

Next Story

Most Viewed