అనుమానాస్పద స్థితిలో యువకుడి ఆత్మహత్య

by  |
chatrinaka
X

దిశ, చార్మినార్: అనుమానాస్పద స్థితిలో 19 సంవత్సరాల యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఛత్రినాక పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగింది. ఛత్రినాక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భయ్యాలాల్​నగర్​కు చెందిన గౌర అలివేలు కుమారుడు గౌర అరవింద్​ (19) ఇంటర్​మీడియట్​ ద్వితీయ సంవత్సరం పూర్తయ్యింది. కరోనా కారణంగా వచ్చిన లాక్​ డౌన్​ నుంచి ఇంట్లోనే ఉంటున్నారు. బుధవారం ఉదయం తల్లి పనికి వెళ్లింది.

11గంటల సమయంలో నల్లా వస్తుందని, మంచినీళ్లు పట్టానని తల్లికి ఫోన్​ చేసి చెప్పాడు. మధ్యాహ్నం 3గంటల సమయంలో ఇంటి పక్క వారు అలివేలుకు ఫోన్​ చేసి మీ అబ్బాయి చీరతో రేకుల షేడ్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. వెంటనే ఇంటికి చేరుకున్న అలివేలు స్థానికుల ద్వారా ఛత్రినాక పోలీసులకు సమాచారం అందజేసింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. అరవింద్​ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేవని పోలీసులు తెలిపారు. ఈ కేసును ఛత్రినాక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed