కొత్త పట్టాదారు పాసు పుస్తకాలకు టెండర్లు ఆహ్వానం

by  |
Pattadaru pass books
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం కొత్త రైతు పట్టాదారు పాసు పుస్తకాల కోసం టెండర్లను ఆహ్వానించింది. అందులో 17 ఫీచర్లు ఉంటాయి. ప్రతి నెలా 60 వేలు(25 శాతం ఎక్కువ, తక్కువ) ముద్రించాల్సి ఉంటుంది. రెండేండ్ల పాటు ముద్రించి హైదరాబాద్ కు సరఫరా చేసే సంస్థల నుంచి టెండర్లు కోరుతూ నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ ఓపెన్ ఎక్స్ప్రెస్ టెండర్ నోటీసును విడుదల చేసింది. బిడ్ డాక్యుమెంట్ ఫీజును రూ.10 వేలుగా నిర్ణయించింది. ఈఎండీ రూ.25 లక్షలుగా పేర్కొంది. ఈ నెల 27వ తేదీ లోగా బిడ్స్ సమర్పించేందుకు ఆఖరు తేదీగా ప్రకటించారు.


Next Story