- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
త్వరలో కొత్త సచివాలయం నిర్మాణం టెండర్లు ఫైనల్
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన కొత్త సచివాలయం నిర్మాణం పనులకు చివరకు రెండు బడా సంస్థలే మిగిలాయి. ఐదారు సంస్థలు టెండర్లు దాఖలు చేసినా టెక్నికల్ బిడ్ పరిశీలన ప్రక్రియ అనంతరం రెండు మాత్రమే నిలదొక్కుకున్నాయి. మిగిలినవన్నీ వెనక్కి పోయాయి. ఈనెల 23వ తేదీన ఈ రెండు సంస్థల ప్రైస్ బిడ్ దరఖాస్తులను కూడా పరిశీలించిన తర్వాత సాయంత్రానికి ఏ సంస్థకు టెండర్ దక్కనుందీ ఫైనల్ అవుతుంది. వరదలు, వర్షాలు, సెలవుల కారణంగా […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన కొత్త సచివాలయం నిర్మాణం పనులకు చివరకు రెండు బడా సంస్థలే మిగిలాయి. ఐదారు సంస్థలు టెండర్లు దాఖలు చేసినా టెక్నికల్ బిడ్ పరిశీలన ప్రక్రియ అనంతరం రెండు మాత్రమే నిలదొక్కుకున్నాయి. మిగిలినవన్నీ వెనక్కి పోయాయి. ఈనెల 23వ తేదీన ఈ రెండు సంస్థల ప్రైస్ బిడ్ దరఖాస్తులను కూడా పరిశీలించిన తర్వాత సాయంత్రానికి ఏ సంస్థకు టెండర్ దక్కనుందీ ఫైనల్ అవుతుంది. వరదలు, వర్షాలు, సెలవుల కారణంగా సోమవారానికే (అక్టోబర్ 19) ఫైనల్ కావాల్సిన ఈ ప్రక్రియ ఐదారు రోజుల పాటు ఆలస్యమైంది. రోడ్లు భవనాల శాఖ అధికారులు ఐదారు సంస్థల టెండర్ పత్రాలను మంగళవారం టెక్నికల్ అంశాల ప్రాతిపదికన పరిశీలించారు. కానీ రెండు మాత్రమే అర్హత సాధించాయి.
Next Story






