త్రుటిలో తప్పిన ప్రమాదం.. లారీని తప్పించబోయి బస్సు బోల్తా

by  |
RTC bus overturned
X

దిశ, కోదాడ: లారీని తప్పించబోయి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున సూర్యాపేట జిల్లా కోదాడ మండలం మేళ్లచెరువు జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు ఎదురుగా లారీ వెళ్తున్న క్రమంలో దాని తప్పించే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు డివైడర్ తగిలి రోడ్డు పక్కన వ్యవసాయ పొలంలో పడింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ అప్రమత్తమై చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. స్థానికులు పోలీసులకు, 108కి సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పదిమందికి గాయలు కాగా, ఎవరూ ప్రాణాపాయ స్థితిలో లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.



Next Story

Most Viewed