- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
GSTపై నెగెటివిటీ జీరో
దేశంలో GST అమలుపై ప్రజల అభిప్రాయాల్లో గణనీయమైన మార్పు కనిపిస్తున్నట్లు తాజా సర్వే వెల్లడించింది.

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో వస్తు, సేవల పన్ను (GST) అమలుపై ప్రజల అభిప్రాయాల్లో గణనీయమైన మార్పు కనిపిస్తున్నట్లు తాజా సర్వే వెల్లడించింది. ఒకప్పుడు జీఎస్టీపై వ్యాపారులు, పన్ను చెల్లింపుదారుల్లో ఉన్న ప్రతికూల భావన ఇప్పుడు దాదాపు పూర్తిగా తగ్గిపోయిందని సర్వే పేర్కొంది. ఈ మేరకు డెలాయిట్ GST@9 సర్వే ఫలితాల ప్రకారం ప్రజల్లో నెగెటివిటీ స్థాయి జీరోకు పడిపోయినట్లు నివేదిక వెల్లడించింది.
సర్వే వివరాల ప్రకారం.. 2022లో జీఎస్టీపై నెగెటివ్ అభిప్రాయం 10 శాతం మేర ఉండగా, 2025 నాటికి అది 5 శాతానికి తగ్గింది. ప్రస్తుతం దాదాపు జీరో స్థాయికి చేరినట్లు సర్వే సూచించింది. జీఎస్టీ వ్యవస్థలో జరిగిన మార్పులు, డిజిటలైజేషన్, పన్ను చెల్లింపుల ప్రక్రియలో సరళీకరణ వంటి అంశాలు ప్రజల్లో సానుకూలత పెరగడానికి కారణమైనట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. చిన్న వ్యాపారులు, దుకాణదారులు, పన్ను చెల్లింపుదారుల్లో గతంతో పోలిస్తే జీఎస్టీపై అవగాహన పెరిగిందని సర్వే తెలిపింది. కాగా 2017 జూలై 1న కేంద్ర ప్రభుత్వం GST ని అమల్లోకి తీసుకురాగా.. దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత ఎదురైన సంగతి తెలిసిందే. రానున్న జూలై 1కి జీఎస్టీ అమలుకు తొమ్మిదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ సర్వే వివరాలు వెల్లడయ్యాయి.
- Tags
- GST
- Telugunews






