- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్రంప్ మైండ్ గేమ్: హోర్ముజ్ ఓపెన్.. కానీ ఇరాన్కు వార్నింగ్!
అమెరికా- ఇరాన్ శాంతి ఒప్పందంతో అత్యంత వ్యూహాత్మకమైన హోర్ముజ్ జలసంధిని ప్రస్తుతానికి తెరిచే ఉంచుతామని, ఎలాంటి నౌకాదళ దిగ్బంధనం విధించబోమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా- ఇరాన్ శాంతి ఒప్పందంతో అత్యంత వ్యూహాత్మకమైన హోర్ముజ్ జలసంధిని ప్రస్తుతానికి తెరిచే ఉంచుతామని, ఎలాంటి నౌకాదళ దిగ్బంధనం విధించబోమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. భవిష్యత్తులో అత్యున్నత స్థాయి అణు తనిఖీలకు ఇరాన్ పూర్తిగా అంగీకరించిందని ట్రంప్ తెలిపారు. అయితే, అమెరికా నౌకాదళం అక్కడే మోహరించి ఉంటుందని, ఒకవేళ పరిస్థితులు మారితే క్షణాల్లో మళ్లీ దిగ్బంధనాన్ని అమలు చేసేందుకు తమ నౌకలన్నీ సిద్ధంగా ఉన్నాయని ఆయన ఇరాన్ను గట్టిగా హెచ్చరించారు. అలాగే ఇరాన్కు నేరుగా నిధులు ఇవ్వకుండా, ఆ డబ్బును కేవలం అమెరికా నుండి ఆహారం, మందులు కొనుగోలు చేయడానికి మాత్రమే ఉపయోగించేలా ఒక ప్రత్యేక ఖాతాలో ఉంచుతామని ట్రంప్ వెల్లడించారు. హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడంతో రికార్డు స్థాయిలో ఒక్కరోజే 19 మిలియన్ బారెళ్ల చమురు రవాణా జరిగిందని, దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు తగ్గుముఖం పడుతున్నాయని ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు, ఈ పరిణామాల మధ్య ఒమన్, ఇరాన్ దేశాలు ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. అంతర్జాతీయ వాణిజ్య నౌకల రాకపోకల కోసం జలసంధిని తెరిచి ఉంచుతామని హామీ ఇస్తూనే, ఈ సముద్ర మార్గంపై తమకున్న సార్వభౌమ హక్కులను ఎవరూ ఉల్లంఘించకూడదని స్పష్టం చేశాయి. అంతేకాకుండా, ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే ఈ ఇంధన రవాణా మార్గం భవిష్యత్తు నిర్వహణ, భద్రత కోసం ఇరు దేశాల ప్రతినిధులతో కలిసి ఒక ప్రత్యేక జాయింట్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఒమన్, ఇరాన్ ప్రకటించాయి.






