యువతి ప్రేమ వ్యవహారం.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో..

by Disha Web Desk |
యువతి ప్రేమ వ్యవహారం.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో..
X

దిశ, నల్లగొండ: ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఓ యువతి వెంటిలేటర్ గ్రిల్స్కు చున్నీతో ఉరి వేసుకుని మృతి చెందిన సంఘటన నల్లగొండ పట్టణంలోని వెంకటరమణ కాలనీలో చోటుచేసుకుంది. వన్ టౌన్ ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని ఎస్ఎల్బీసీ వెంకటరమణ కాలనీ అయ్యప్ప గుడి సమీపంలో బుర్రి నాగేంద్రమ్మ తన తల్లితో నివాసముంటుంది. ఈమెకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. తల్లి కూతుళ్లు కూరగాయల మార్కెట్లో కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. శుక్రవారం అమ్మ, అమ్మమ్మ రోజువారీ విధంగానే కూరగాయలు అమ్మేందుకు మార్కెట్ కు వెళ్లగా ఇంట్లో ఎవరు లేని సమయంలో నాగేంద్రమ్మ కూతురు బుర్రి మనీషా (25 ) ఇంట్లో ఉన్న వెంటిలేటర్ గ్రిల్స్కు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వ్యాపారం ముగించుకొని తల్లి ఇంటికి రాగా మూసివున్న తలుపులు ఎంత కొట్టినా తీయకపోవడంతో తల్లి కేకలు వేసింది. దీంతో కాలనీవాసులు తలుపులు పగలగొట్టి చూడగా ఇంట్లో అప్పటికే ఉరి వేసుకొని మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

నా బిడ్డ మృతికి అతడే కారణం...

నా బిడ్డ మనీషా మృతికి అన్నారెడ్డిగూడెం గ్రామానికి చెందిన పొదల రాజేష్ కారణమని మృతురాలి తల్లి నాగేంద్రమ్మ తెలిపారు. గత నాలుగు సంవత్సరాల నుండి నా కూతుర్ని పెండ్లి చేసుకుంటానని చెప్పి నమ్మబలికి చివరికి మోసం చేశాడని ఆమె ఆరోపించారు. నా కూతురు ఆత్మహత్య చేసుకోలేదని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆమె రోధించారు.

Next Story