బీహార్ సీఎం, స్పీకర్ మధ్య వార్: అసెంబ్లీ సాక్షిగా నితీశ్ కుమార్ ఆగ్రహం

by Disha Web Desk 17 |
బీహార్ సీఎం, స్పీకర్ మధ్య వార్: అసెంబ్లీ సాక్షిగా నితీశ్ కుమార్ ఆగ్రహం
X

పాట్నా: బీహార్ సీఎం నితీష్ కుమార్, స్పీకర్ విజయ్ కుమార్ సిన్హాల మధ్య అసెంబ్లీ సమావేశాల్లోఘర్షణ వాతావరణం నెలకొంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్పీకర్ ప్రశ్నలు లేవనెత్తడంతో సీఎం అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రశ్నలతో రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ఆరోపించారు. ఈ సంఘటనతో ఒక్కసారిగా బీజేపీపై నితీష్ కుమార్ అసహనం కలిగి ఉన్నారనే వాదనలు తెరపైకి వచ్చాయి. కాగా గత నెలలో స్పీకర్ నియోజకవర్గంలో కరోనా నిబంధనలు ఉల్లంఘించారని కొందరు బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిలో స్పీకర్ కలగజేసుకోవడంతో పోలీసులు ఆయన తప్పుగా ప్రవర్తించారని తెలిపారు. అయితే ఈ అంశంలో సంబంధిత పోలీసులపై చర్యలు తీసుకోవాలని అసెంబ్లీలో స్పీకర్ ప్రభుత్వాన్ని కోరారు. ఇలాంటి విషయాల్లో ప్రభుత్వం ఎవ్వరికీ అండగా ఉండబోదని నితీష్ కుమార్ తేల్చి చెప్పారు. కాగా గత కొన్ని రోజులుగా బీజేపీకి నితీష్ కుమార్‌కు మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోంది. దీంతో మరోసారి ఈ విషయం స్పష్టమైంది.



Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed