చావులనూ వివాదం చేయడం చంద్రబాబుకే సొంతం: వైసీపీ ఎంపీ

by Disha Web |
చావులనూ వివాదం చేయడం చంద్రబాబుకే సొంతం: వైసీపీ ఎంపీ
X

దిశ, ఏపీ బ్యూరో : శవరాజకీయాలు చేయడంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దిట్ట అని వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి ఆరోపించారు. చావులనూ వివాదం చేయడం చంద్రబాబు దివాళాకోరు రాజకీయానికి నిదర్శనమని విమర్శించారు. అనారోగ్యం, వృద్ధాప్య సమస్యలతో ఎవరు రాలిపోయినా రాబందుల చంద్రబాబు అక్కడ వాలిపోతున్నారంటూ ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. విషాదంలో ఉన్నవారిని ఓదార్చాల్సింది పోయి మరింత క్షోభకు గురి చేస్తున్నాడని ధ్వజమెత్తారు. అంతేకాదు కొన్ని చోట్ల అయితే చంద్రబాబు వెళ్లేవరకు అంత్యక్రియలు జరగకుండా పచ్చ బ్యాచ్‌ అడ్డుకుంటోందని ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు.

మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయాల వ్వవస్థను నీతి అయోగ్‌ సహా అన్ని రాష్ట్రాలు కొనియాడాయంటూ ట్వీట్ చేశారు. గ్రామస్థాయిలోనే అన్ని ప్రభుత్వ పనులు జరిగేలా 15,004 సచివాలయాలు 34 శాఖలకు సంబంధించిన 543 సేవలు అందిస్తున్నాయి. ఇప్పటి వరకు 3.52 కోట్ల వినతులు పరిష్కారమవడం సరికొత్త రికార్డు సృష్టించారంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.


Next Story

Most Viewed