మున్సిపల్ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో మహిళల ధర్నా

by Jakkula.Mamatha |

మున్సిపల్ పరిధిలోని హోతీ(కే) డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల మహిళలు ఖాళీ బిందెలతో మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు.

మున్సిపల్ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో మహిళల ధర్నా
X

దిశ,జహీరాబాద్: మున్సిపల్ పరిధిలోని హోతీ(కే) డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల మహిళలు ఖాళీ బిందెలతో మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. మంచి నీటి సమస్యతో పాటు వీధి దీపాల సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన ఖాళీ బిందెల ధర్నా కార్యక్రమంలో స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Next Story