జైపూర్‌లో దారుణం.. విదేశీ మహిళపై అత్యాచారం.. దాని కోసం పిలిస్తే..!

by Disha Web Desk 19 |
జైపూర్‌లో దారుణం.. విదేశీ మహిళపై అత్యాచారం.. దాని కోసం పిలిస్తే..!
X

దిశ, వెబ్‌డెస్క్: రాజస్థాన్‌లోని జైపూర్‌లో దారుణం జరిగింది. మసాజ్ కోసం పిలిచిన విదేశీ మహిళపై ఓ కీచకుడు అత్యాచారం చేసిన ఘటన వెలుగు చూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. కేరళ రాష్ట్రానికి చెందిన బిజు మురళీధరన్ జైపూర్ లోని ఖతీపురా ప్రాంతంలో మసాజ్ సర్వీస్ ప్రొవైడర్‌గా పనిచేస్తున్నాడు. అయితే, డచ్‌కు చెందిన ఓ 31ఏళ్ల మహిళ రాజస్థాన్‌లోని జైపూర్‌‌కు పర్యటనకు వచ్చింది. సర్వీస్ ప్రొవైడర్‌గా చేస్తున్న మురళీధరన్‌ను ఆయుర్వేద మసాజ్ కోసం జైపూర్‌లోని ఒక హోటల్‌కు పిలిచింది. కాగా, మసాజ్ చేయడానికి వెళ్లిన మురళీధరన్ మహిళపై హోటల్‌లోనే అత్యాచారం చేసి.. తన‌లోని కామబుద్ధిని చూపించాడు. దీనితో మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి.. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.



Next Story