చర్చి ఎదుట షెల్టర్‌లో మహిళ.. కోపంతో చర్చి ఫాదర్ ఏం చేశాడంటే..!(వీడియో)

by Disha Web |
చర్చి ఎదుట షెల్టర్‌లో మహిళ.. కోపంతో చర్చి ఫాదర్ ఏం చేశాడంటే..!(వీడియో)
X

దిశ-బూర్గంపాడు: బూర్గంపాడు మండలం సారపాకలో చర్చి ఫాదర్ నమ్మించి పెళ్లి చేసుకొని కొడుకు పుట్టిన తర్వాత తనకు సంబంధం లేదని మోసం చేశాడని ఓ మహిళా సంబంధిత ఫాదర్ చర్చి ఎదుట ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఈ సంఘటన గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సారపాకలో క్రీస్తు సంఘం చర్చి ఫాస్టర్ శెట్టి మళ్ల సువర్ణ రాజు సులోచన అనే మహిళను గత 14 ఏండ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో వీరికి బాబు జన్మించాడు.

కాగా, గత మూడేళ్లుగా తనను, తన బిడ్డను పట్టించుకోవడంలేదని తమకు న్యాయం చేయాలంటూ గత రెండు నెలలుగా చర్చి ఎదుట షెల్టర్ ఏర్పాటు చేసుకుని నిరసన తెలుపుతుంది. ఈ క్రమంలో బుధవారం రాత్రి సువర్ణ రాజు తన లాయర్ తోపాటు వచ్చి తాను ఏర్పాటు చేసుకున్న షెల్టరును కూల్చివేసి, అవమానించారని బాధితురాలు వాపోయింది. దీంతో ఆమె ఫినాయల్ తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఇది గమనించిన స్థానికులు బాధితురాలని హుటాహుటిన భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని తెలిసింది. ఈ విషయంపై బూర్గంపాడు ఎస్‌ఐ జితేందర్‌ను వివరణ కోరగా బాధితురాలు ఫిర్యాదు చేస్తే విచారించి కేసు నమోదు చేస్తామన్నారు.

Next Story

Most Viewed