- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెరువులో మహిళ మృతదేహం.. ఏం జరిగింది ?
by S Gopi |
దిశ, కల్వకుర్తి: అనుమానస్పద స్థితిలో ఓ మహిళ చెరువులో పడి మృతిచెందిన..Woman dies in suspicious circumstances

X
దిశ, కల్వకుర్తి: అనుమానస్పద స్థితిలో ఓ మహిళ చెరువులో పడి మృతిచెందిన ఘటన కల్వకుర్తి డివిజన్ పరిధిలోని ఉర్కొండ మండలం జగబోయినిపల్లి గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామ సమీపంలోని నల్ల కుంట చెరువులో గుర్తు తెలియని మృతదేహం పైకి తేలడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ విషయం తెలుసుకున్న ఉర్కొండ మండల ఇన్ చార్జ్ ఎస్ఐ వెంకట్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతురాలు జగబోయిని పల్లి గ్రామానికి చెందిన అరుణమ్మ(53)గా గుర్తించారు. మృతదేహాన్ని కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. మృతురాలికి ముగ్గురు సంతానం, భర్త గత సంవత్సరం కోవిడ్ కారణంగా మృతి చెందాడు. మృతురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు ఉర్కొండ మండల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






