పిడుగుపడి ఒక మహిళ మృతి.. రెండు ఎద్దులు సైతం

by Batti.Sumithra |   (  Updated:2026-06-07 13:46:06  IST  )

రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది.

పిడుగుపడి ఒక మహిళ మృతి.. రెండు ఎద్దులు సైతం
X

దిశ, చేవెళ్ల : రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. రెండు గ్రామాలలో పిడుగులు సైతం పడి ఓ మహిళ, రెండు ఎద్దులు మృత్యువాత పడ్డాయి. చేవెళ్ల మున్సిపాలిటీలోని కేసారం గ్రామంలో పిడుగుపడి ఒక మహిళ దుర్మరణం చెందింది. అలాగే చేవెళ్ల మండల పరిధిలోని గుండాల గ్రామంలో యాలాల మల్లారెడ్డికి చెందిన రెండు ఎడ్లు పిడుగుపాటుకు మృతి చెందాయి. వాటి విలువ సుమారు రూ. 1,50,000 ఉంటాయని తెలిపారు.

బావిలో పడి యువకుడు మృతి.. గర్భిణీ భార్యకు తీరని విషాదం

Next Story