యువకుడితో లేచిపోయిన నలుగురు పిల్లల తల్లి.. 3 ఏళ్లు సహజీవనం చేసిన తర్వాత..

by Dishanational1 |
యువకుడితో లేచిపోయిన నలుగురు పిల్లల తల్లి.. 3 ఏళ్లు సహజీవనం చేసిన తర్వాత..
X

దిశ, వెబ్ డెస్క్: నలుగురు పిల్లలున్న ఓ మహళ తన భర్తను, పిల్లలను వదిలేసి ప్రియుడితో పారిపోయింది. అతడితో మూడేళ్లపాటు సహజీవనం చేసింది. ఆ తర్వాత అతడిని చంపేసి తిరిగి భర్త వద్దకు చేరింది. పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఝార్ఖండ్ లోని సెరాయ్ కు చెందిన ఓ మహిళకు నలుగురు పిల్లలు, భర్త ఉన్నారు. అయితే, ఆ మహిళ ఓ యువకుడితో ప్రేమలో పడింది. అలా అతనితో ప్రేమలో పడిన ఆ మహిళ తన పిల్లలను, భర్తను వదిలేసి ప్రియుడితో పారిపోయింది. మూడేళ్లపాటు అతనితో సహజీవనం చేసినంక అతడికి మరో పెళ్లి అయిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య గొడవలయ్యాయి. ఈ క్రమంలో తిరిగి తన భర్త, పిల్లల వద్దకు వెళ్లాలని నిశ్చయించుకుంది. అందుకు ప్రియుడు ఒప్పుకోలేదు. కొద్దిరోజులపాటు ఆమెను ఇంట్లో బంధించాడు. ఆ తర్వాత నీతోనే ఉంటానని అతడిని నమ్మించింది. ఆ రోజు రాత్రి ఇద్దరు పడుకున్నారు. ప్రియుడు నిద్రపోయినంక అర్ధరాత్రి అతడిపై రాడ్డుతో దాడి చేసింది. దీంతో అతడు చనిపోయాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయి తన భర్త, పిల్లల వద్దకు చేరుకుంది. అయితే, ఆ ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో ఇంటి పక్కవారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.

Next Story

Most Viewed