విజ‌య సంక‌ల్ప స‌భ‌తో టీఆర్ఎస్ నేతల గుండెల్లో రైళ్లు ప‌రిగెడుతున్నాయి : విజయశాంతి

by Disha Web Desk |
విజ‌య సంక‌ల్ప స‌భ‌తో టీఆర్ఎస్ నేతల గుండెల్లో రైళ్లు ప‌రిగెడుతున్నాయి : విజయశాంతి
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ‌లో జరిగిన విజ‌య సంక‌ల్ప స‌భ‌తో టీఆర్ఎస్ నేతల గుండెల్లో రైళ్లు ప‌రిగెడుతున్నాయని బీజేపీ నేత విజయశాంతి సెటైర్లు వేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప‌ర్యటన‌ రాష్ట్రంలోని బీజేపీ శ్రేణుల్లో నూత‌నోత్సాహం నింపిందన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సూచించారని విజయశాంతి తెలిపారు. ప్రధాని సభ గ్రాండ్ సక్సెస్ అయిందని అన్నారు. బీజేపీ సమావేశాల సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సొమ్ముతో ప్రకటనలు ఏర్పాటు చేసుకుని వెకిలి ఆనందం పొందిందని, బోనాలకు వచ్చినంత జనం కూడా రాలేదని రాష్ట్ర మంత్రులు మాట్లాడడం వారి అవివేకానికి నిదర్శనం అని విమర్శించారు. అసలు పార్టీ మీటింగ్‌ని బోనాలతో పోల్చడమేంటి? కేసీఆర్ అండ్ కో మోడీని తిడుతూ అల్ప సంతోషాన్ని పొందుతున్నారని మండిపడ్డారు. మరోసారి అధికారంలోకి వస్తామని సీఎం కేసీఆర్ పగటి కలలు కంటున్నారని కానీ, తెలంగాణలో ఈసారి కాషాయ జెండా ఎగరడం ఖాయం అంటూ విజయశాంతి ట్వీట్ చేశారు.

Next Story

Most Viewed