హైదరాబాద్ వాసులకు అదిరిపోయే న్యూస్.. బేగంపేట ఎయిర్‌పోర్టులో 24 నుంచి 'ఎయిర్ షో'

by Disha Web Desk 2 |
హైదరాబాద్ వాసులకు అదిరిపోయే న్యూస్.. బేగంపేట ఎయిర్‌పోర్టులో 24 నుంచి ఎయిర్ షో
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్టులో త్వరలోనే ఎయిర్ షో ప్రారంభం కానుంది. ఈ నెల 24 నుంచి 27వ తేదీ వరకు వింగ్స్ ఇండియా-2022 పేరుతో ఎయిర్ షో నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా బేగంపేట ఎయిర్‌పోర్టు వేదికగా జరిగే ఈ ఎయిర్‌ షోలో పలు దేశీయ, అంతర్జాతీయ సంస్థలకు చెందిన అత్యాధునిక విమానాలు, జెట్లు, హెలికాప్టర్లు నగరవాసులను కనువిందు చేయనున్నాయి. కరోనా కారణంగా నాలుగేళ్ల విరామం అనంతరం మళ్లీ ఎయిర్ షోను నిర్వహిస్తున్నారు. నాలుగు రోజులపాటు సాగే ఈ ప్రదర్శనలో 200కు పైగా అంతర్జాతీయ సంస్థలు, ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారు. ఆరువేలకు పైగా ట్రేడ్ విజిటర్స్, 50 వేల మంది సందర్శకులు పాల్గొంటారని అధికారుల అంచనా వేశారు. ఈ ప్రదర్శనలను వీక్షించాలనుకునే వారు వింగ్స్ ఇండియా అధికారిక వెబ్ సైట్‌లో ఆన్ లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటును అధికారులు కల్పించారు. తొలి మూడురోజులు వ్యాపారవేత్తలను, చివరిరోజు సాధారణ సందర్శకులు రూ.500 చెల్లించి ప్రదర్శనలను వీక్షించడానికి అవకాశం కల్పించారు.



Next Story