దానికి బానిసైన భర్త.. విసిగిపోయిన భార్య కారంతో..

by Web Desk |
దానికి బానిసైన భర్త.. విసిగిపోయిన భార్య కారంతో..
X

దిశ, చెన్నూరు: మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని ఓత్కులపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. మద్యం తాగి ప్రతిరోజు తనను వేధిస్తున్నాడన్న నెపంతో భార్య భర్తను కళ్లలో కారం కొట్టి, తలపై కర్రతో దాడి చేసింది. దాంతో భర్త సారయ్య (36) అక్కడికక్కడే మృతి చెందాడు. భర్త మరణించడంతో భార్య మల్లీశ్వరి పరార్ అయింది. గ్రామస్తులు మరియు పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ కథనం ప్రకారం.. భర్త తాగుడుకు బానిస కావడంతో భార్య-భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని తెలిపారు. అదే విధంగా గత రాత్రి కూడా భర్త మద్యం సేవించి రావడంతో భార్యా-భర్తల మధ్య గొడవ జరిగిందని, ఆ గొడవతో సహనం కోల్పోయిన భార్య ఆవేశంలో గురువారం తెల్లవారుజామున కళ్లలో కారం కొట్టి, తలపై కర్రతో దాడి చేయగా ఆమె భర్త మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Next Story

Most Viewed