- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజాబాటలో విద్యుత్ భద్రతపై విస్తృత అవగాహన
హుజూరాబాద్ టౌన్ సెక్షన్ పరిధిలో మంగళవారం నిర్వహించిన 'ప్రజాబాట' కార్యక్రమంలో విద్యుత్ భద్రతపై వినియోగదారులు, రైతులకు విస్తృత అవగాహన కల్పించినట్లు కరీంనగర్ డీఈ (టెక్నికల్ అండ్ సేఫ్టీ) ఉపేందర్ తెలిపారు.

దిశ, హుజూరాబాద్ రూరల్ : హుజూరాబాద్ టౌన్ సెక్షన్ పరిధిలో మంగళవారం నిర్వహించిన 'ప్రజాబాట' కార్యక్రమంలో విద్యుత్ భద్రతపై వినియోగదారులు, రైతులకు విస్తృత అవగాహన కల్పించినట్లు కరీంనగర్ డీఈ (టెక్నికల్ అండ్ సేఫ్టీ) ఉపేందర్ తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో విద్యుత్ భద్రతను మరింత బలోపేతం చేసి, అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడమే టీజీఎన్పీడీసీఎల్ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
సిబ్బందికి 'వన్ మినిట్ సేఫ్టీ' తప్పనిసరి..
ఈ సందర్భంగా డీఈ ఉపేందర్ మాట్లాడుతూ.. విద్యుత్ శాఖ సిబ్బంది విధి నిర్వహణలో ప్రతి ఉద్యోగి 'వన్ మినిట్ సేఫ్టీ' సూత్రాన్ని తప్పనిసరిగా పాటించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ప్రతి పని ప్రారంభించే ముందు ప్రమాదాలను అంచనా వేసి, అవసరమైన భద్రతా చర్యలు తీసుకోవడం ద్వారా విద్యుత్ ప్రమాదాలను పూర్తిగా నివారించవచ్చని స్పష్టం చేశారు.
రైతులు స్వయంగా ఫ్యూజ్లు మార్చవద్దు..
వ్యవసాయ విద్యుత్ వినియోగదారులు ఎట్టి పరిస్థితుల్లోనూ స్వయంగా ఫ్యూజ్లు మార్చేందుకు ప్రయత్నించవద్దని డీఈ సూచించారు. విద్యుత్ లైన్లలో సాంకేతిక లోపాలు తలెత్తినప్పుడు వెంటనే 1912 టోల్ ఫ్రీ నంబర్**కు సమాచారం అందించాలని కోరారు. అలాగే వ్యవసాయ మోటార్లకు అదనపు లోడ్లు వినియోగిస్తున్న రైతులు 5 హెచ్పీ నుంచి 7.5 హెచ్పీ వరకు ఉన్న అదనపు లోడ్లను నిబంధనల ప్రకారం క్రమబద్ధీకరించుకోవాలని పిలుపునిచ్చారు.
అధికారులకు కీలక ఆదేశాలు..
విద్యుత్ సరఫరా నాణ్యతను మెరుగుపరచడం, ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా అధికారులు పలు చర్యలు చేపట్టాలని డీఈ ఆదేశించారు. పొడవైన విద్యుత్ లైన్ల మధ్య అదనపు స్తంభాలు ఏర్పాటు చేయాలి, దెబ్బతిన్న షార్ట్ పోల్స్ స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలి, వదులుగా ఉన్న వైర్లను సరిచేయాలి, తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ స్తంభాల ప్లింత్లను పైకి లేపాలి, వ్యవసాయ మోటార్లకు తప్పనిసరిగా కెపాసిటర్లు అమర్చేలా చూడాలి. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ ఏఈ (ఆపరేషన్), ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సిబ్బందితో పాటు పెద్ద సంఖ్యలో విద్యుత్ వినియోగదారులు, రైతులు పాల్గొన్నారు.






