సామూహిక వినాశనానికి బిల్లు: ఎంపీ శశిథరూర్ సెటైర్

by Disha Web Desk 17 |
సామూహిక వినాశనానికి బిల్లు: ఎంపీ శశిథరూర్ సెటైర్
X

న్యూఢిల్లీ: ఇంధన ధరల పెంపు, ద్రవ్యోల్బణం వంటి విషయాల్లో కేంద్రం చర్యలపై సీనియర్ కాంగ్రెస్ నేత శశిథరూర్ తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రం సామాన్యులపై సామూహిక వినాశన ఆయుధాలను ఉపయోగిస్తుందని ఆరోపించారు. సామూహిక వినాశనానికి ఆయుధాలు పేరుతో కొత్త బిల్లును తీసుకురావాలని ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు. ప్రభుత్వం ధరల పెంపు గురించి మాట్లాడదని అర్థమైంది. లోక్ సభ ద్వారా సామూహిక నాశనానికి ఆయుధాలు అని బిల్లును ఆమోదించాలి. కేంద్ర ప్రభుత్వం బలం ఇదే. హలాల్, హిజాబ్, అజాన్‌లపై అర్థం లేని వివాదాలతో, మీడియా సహాయంతో, మద్దతుతో ధరల పెరుగుదల నుండి దృష్టిని దూరం చేసింది' అని ఆరోపించారు.

Next Story

Most Viewed