నిమ్స్​ నర్సులకు వార్నింగ్​..ప్రశ్నిస్తే టెర్మినేషన్​

by Dishafeatures2 |
నిమ్స్​ నర్సులకు వార్నింగ్​..ప్రశ్నిస్తే టెర్మినేషన్​
X

దిశ, తెలంగాణ బ్యూరో: దాదాపు పది రోజుల పాటు నిమ్స్​‌లో స్ట్రైక్​ చేసిన కాంట్రాక్ట్​ స్టాఫ్​ నర్సులు ఎట్టకేలకు విధుల్లో చేరారు. నిరసనలు వ్యక్తం చేస్తున్నోళ్లందరినీ టెర్మినేషన్​ చేస్తామని బెదిరించి మరీ విధుల్లో చేర్పించారంటూ నర్సులు ఆరోపిస్తున్నారు. ఇటు ప్రభుత్వం, నిమ్స్​ ఒత్తిళ్లు తట్టుకోలేక నర్సులంతా బుధవారం నుంచే డ్యూటీల్లో చేరిపోయారు. అయితే కాంట్రాక్ట్​ స్టాఫ్ ​నర్సులకు ఇస్తున్న ప్రస్తుత వేతనం రూ. 25 వేలను రూ. 35 వేలకు పెంచుతూ నిమ్స్​ నిర్ణయం తీసుకున్నది. దీనికి తోడు గడిచిన ఏడు నెలల నుంచి ఏరియల్స్​ ఇవ్వనున్నారు. అంతేకాక పే-స్లిప్​లు కూడా ఇచ్చేందుకూ అంగీకరించింది. ఇక మెటర్నిటీ లీవ్స్​ అంశంలో ఎగ్జిక్యూటివ్​ బోర్డు మీటింగ్‌ లో చర్చించి చెబుతామంటూ డైరెక్టర్​ నర్సులకు వివరించారు.

Next Story

Most Viewed