Breaking: వరంగల్ MGM బాధితుడు శ్రీనివాస్ మృతి

by Disha Web Desk 2 |
Breaking: వరంగల్ MGM బాధితుడు శ్రీనివాస్ మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి బాధితుడు శ్రీనివాస్ మృతిచెందారు. హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్ పరిస్థితి విషమించి శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కాగా, వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్ అనే రోగి చేతులు, కాళ్ల వేళ్లను ఎలుకలు కొరుక్కుతిన్నాయి. ఇంత దారుణం జరిగినా ఆస్పత్రి సిబ్బంది పట్టించుకోవడంలేదని రోగి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం సైతం సీరియస్ అయి, కలెక్టర్ విచారణ ఆదేశించారు. దీంతో హుటాహుటిన హైదరాబాద్‌కు తరలించారు. పరిస్థితి విషమించి బాధితుడు శ్రీనివాస్ మరణించారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే.


Next Story

Most Viewed