- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
సద్దలోనిపల్లి శ్రీకృష్ణ స్వామి దేవాలయంలో హుండీ చోరీ
by Disha Web Desk 11 |
X
దిశ, గద్వాల టౌన్ : జోగులాంబ గద్వాల జిల్లా మల్లకల్ మండలం పరిధిలోని సద్దలోని పల్లి గ్రామంలో శ్రీకృష్ణ స్వామి దేవాలయంలో హుండీ పగలగొట్టి పట్టపగలే మూడు నుంచి నాలుగు లక్షల వరకు దొంగతనం జరిగినట్టు ఆలయ చైర్మన్ రామకృష్ణ తెలిపారు. పూజారి ప్రతిరోజు ఉదయం 6 గంటలకు దేవాలయంలో వచ్చి ఉండేవాడని, కానీ నేడు (శుక్రవారం) తెల్లవారుజామున 3గంటలకే రావడం జరిగిందని, ఆలయ చైర్మన్ కు చోరీ జరిగిన విషయం వెంటనే తెలుపకుండా, ఆలయంలో చోరీ జరిగిన విషయాన్ని పూజారి ఆలస్యంగా తెలపడంతో పూజారి పై గ్రామస్తులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు స్పందించి చోరికి పాల్పడినటువంటి నిందితులను పట్టుకుని చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Next Story