- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ప్రజల దృష్టి మళ్లించేందుకే రిజర్వేషన్లపై రాద్ధాంతం : బీఎల్.సంతోష్
దిశ, నారాయణపేట ప్రతినిధి : ప్రజల దృష్టి మళ్లించేందుకే రిజర్వేషన్లపై రాద్ధాంతం చేస్తున్నారని, ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని బీజేపీ జాతీయ వ్యవహారాల ఇన్చార్జి బీఎల్ సంతోష్ ఆరోపించారు. నారాయణపేట లో జిల్లాస్థాయి బూత్ అధ్యక్షులు ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకున్నదన్నారు.కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని కోరారు. రాష్ట్రంలో బీజేపీకి మంచి వాతావరణం ఉందని దానిని అందిపుచ్చుకుని రాష్ట్రంలో అత్యధిక ఎంపీ సీట్లు గెలుచుకోవడం కోసం వారం రోజులు కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని కోరారు. ఎంపీ అభ్యర్థి డీకే అరుణ మాట్లాడుతూ కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించేలా గడప గడపకు వెళ్లి కోరాలన్నారు. నాగూరావు నామాజీ, రతంగ్ పాండు రెడ్డి, ప్రదీప్ కుమార్ గౌడ్, శ్రీనివాసులు,రఘు రామయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.