కవిత బెయిల్ కోసం ఎంపీ సీట్లను అమ్ముకున్న కేసీఆర్!.. కాంగ్రెస్ సెటైర్

by Disha Web Desk 5 |
కవిత బెయిల్ కోసం ఎంపీ సీట్లను అమ్ముకున్న కేసీఆర్!.. కాంగ్రెస్ సెటైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కవిత బెయిల్ కోసం కేసీఆర్ ఎంపీ సీట్లను అమ్ముకున్నాడని రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు నిజమేనని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. మాజీ మంత్రి మల్లారెడ్డి మల్కాజ్ గిరి బీజేపీ ఎంపీ అభ్యర్ధి ఈటెల రాజేందర్ ను కలవడంపై ట్విట్టర్ వేదికగా సెటైర్ వేస్తూ వీడియో విడదల చేసింది. ఈ వీడియో లో మల్లారెడ్డి, ఈటెల రాజేందర్ ను ఆలింగనం చేసుకుంటూ.. నువ్వే గెలుస్తవ్ అంటున్న దానికి, కేసీఆర్ కవిత బెయిల్ కోసం బీఆర్ఎస్, బీజేపీ చీకటి ఒప్పందంలో భాగంగా బీజేపీని గెలిపించేందుకు మహాబూబ్ నగర్, చేవెళ్ల, భువనగిరి, జహీరాబాద్, మల్కా్జ్ గిరి ఈ ఐదు పార్లమెంట్ లలో బీఆర్ఎస్ డమ్మీ అభ్యర్ధులను నిలబెట్టి బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మగౌరవాన్ని నరేంద్ర మోడీ దగ్గర తాకట్టు పెట్టాడని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సభలో చేసిన వ్యాఖ్యలను జత చేసింది. దీనికి ఒక్కటైన బీజేపీ, బీఆర్ఎస్ దొంగలు అని ఎక్స్ లో రాసుకొచ్చింది.




Next Story

Most Viewed