BREAKING: బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడెం నగేష్ నామినేషన్‌పై కొనసాగుతున్న ప్రతిష్టంభన.. తిరస్కరించాలని కాంగ్రెస్, బీఎస్పీ డిమాండ్

by Disha Web Desk 1 |
BREAKING: బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడెం నగేష్ నామినేషన్‌పై కొనసాగుతున్న ప్రతిష్టంభన.. తిరస్కరించాలని కాంగ్రెస్, బీఎస్పీ డిమాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికల వేళ రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ప్రస్తుతం ఎన్నికల అధికారి సమక్షంలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే పలు పార్టీల అభ్యర్థులు సమర్పించిన నామినేషన్లపై అక్కడక్కడ వివాదాలు తలెత్తుతున్నాయి. తాజాగా, ఆదిలాబాద్ బీజేపీ అభ్యర్థి గోడెం నగేష్ దాఖలు చేసిన నామినేషన్ ఆమోదంపై ఆభ్యంతరం తలెత్తింది. నామినేషన్ దాఖలులో కనీస నిబంధనలు పాటించలేదంటూ కాంగ్రెస్, బీఎస్పీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరుకు వారు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసేందుకు వెళ్లినా.. తమ ఫిర్యాదును స్వీకరించలేదని వారు ఆరోపించారు. దీంతో గోడెం నగేష్ నామినేషన్‌‌ను వెంటనే తిరస్కరించాలని కాంగ్రెస్, బీఎస్పీ అభ్యర్థులు రిట్నరింగ్ అధికారిని డిమాండ్ చేశారు.



Next Story