- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇరాన్లో యుద్ధ బీభత్సం.. 787కు చేరిన మరణాల సంఖ్య
ఇరాన్లో ఇజ్రాయెల్-అమెరికా దాడుల బీభత్సం! 787 మంది మృతి; సుప్రీం లీడర్ ఖమేనీ మరణించినట్లు నివేదికలు. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు.

దిశ, వెబ్ డెస్క్: అగ్రరాజ్యం అమెరికాతో కలిసి ఇజ్రాయెల్ వైమానిక దళం.. ఇరాన్ పై మెరుపు దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ఇరాన్ సుప్రీం ఖమేనీ తో పాటు ఆయన భార్య ఇతర కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. గత నాలుగు రోజులుగా కొనసాగుతున్న ఈ భీకర యుద్దంలో పెద్ద ఎత్తున నష్టం జరిగింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటి వరకు 787 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఇరానియన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ (IRCS) అధికారికంగా ప్రకటించింది. గత సోమవారం వరకు 555 గా ఉన్న మృతుల సంఖ్య, మంగళవారం నాటి భీకర దాడుల తర్వాత ఒక్కసారిగా పెరిగింది. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ తో పాటు మరో 40 మంది ఉన్నతాధికారులు ప్రాణాలు కోల్పోయినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం ఇరాన్లోని 31 ప్రావిన్స్లలో దాదాపు 20కి పైగా ప్రావిన్స్లు, 131 నగరాలు ఈ దాడుల ప్రభావానికి గురై రక్తసిక్తమయ్యాయి.
యుద్ధం నాలుగో రోజుకు చేరుకోవడంతో ఇరు పక్షాల మధ్య దాడులు, ప్రతి దాడులు తీవ్రతరమయ్యాయి. తమ దేశంపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఇరాన్ కూడా గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు భారత రాయబార కార్యాలయం ప్రత్యేక చర్యలు చేపట్టింది. పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారడంతో అంతర్జాతీయ సమాజం ఈ యుద్ధం మరిన్ని దేశాలకు వ్యాపిస్తుందేమోనన్న భయాందోళనలో ఉంది.






