- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నూతన అటవీ ప్రధాన సంరక్షణాధికారిగా వినయ్ కుమార్ నియామకం
తెలంగాణ రాష్ట్ర అటవీ దళాల అధిపతిగా 1992 బ్యాచ్కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి వినయ్ కుమార్ ను ఎఫ్ఏసీగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర అటవీ దళాల అధిపతిగా 1992 బ్యాచ్కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి వినయ్ కుమార్ ను ఎఫ్ఏసీగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన కొత్తగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఉన్న సి.సువర్ణ పదవీ కాలం ఈ నెల 30 న ముగియనుంది.. మూడు దశాబ్దాలకుపైగా అటవీ పరిపాలన అనుభవం కలిగిన ఆయన గతంలో అటవీ శాఖ, గ్రామీణాభివృద్ధి, నీటిపారుదల శాఖల్లో వివిధ కీలక హోదాల్లో పనిచేశారు. ఆదిలాబాద్ డీపీఏపీ ప్రాజెక్ట్ డైరెక్టర్గా, కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్గా పనిచేయడంతో పాటు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ కమిషనర్ గా బాధ్యతలు నిర్వహించారు.
తెలంగాణలో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్గా పనిచేసిన ఆయన, వరల్డ్ బ్యాంక్, జైకా సహకారంతో అమలైన ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్గా కూడా వ్యవహరించారు. నీటి వనరుల సుస్థిర నిర్వహణలో చేసిన కృషికిగాను 2014లో ఐక్యరాజ్యసమితి ‘వాటర్ ఫర్ లైఫ్’ అవార్డులో ఫస్ట్ రన్నర్-అప్గా గౌరవం పొందారు. ఈ సందర్భంగా వినయ్ కుమార్ మాట్లాడుతూ, ‘ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తిస్తూ, వన్యప్రాణుల సంరక్షణతో పాటు ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ అటవీ పరిరక్షణ చర్యలను మరింత బలోపేతం చేస్తా’ అని తెలిపారు.






