ఆగ్రామాల్లోకి వెలుగు వచ్చేనా ?

by Dishafeatures2 |
ఆగ్రామాల్లోకి వెలుగు వచ్చేనా ?
X

దిశ,చింతలమానేపల్లి : వీధి దీపాలు వెలగక డబ్బా ,దరంపల్లి, బరేగుడ ప్రజలు చిమ్మ చీకట్లో కాలం గడిపేస్తున్నారు. ఏ ఒక్క అధికారి కానీ, సర్పంచ్ కానీ, స్వయంగా ఎంపీపీ ఇక్కడ నుంచే గెలిచి ఉన్న కూడా ఆ గ్రామాల ప్రజలను పట్టించుకునేవారే లేరని ప్రజలు వాపోతున్నారు. రాత్రి పూట మూత్రశాల, అత్యవసరం పనుల నిమిత్తం బయటకు వెళ్లాలంటే ఎటు నుంచి ఏం వస్తుందో.. తేలు,పాములు నుంచి ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికైన వెంటనే ప్రజాప్రతినిధులు,సర్పంచ్ ,అధికారులు స్పందించి వీధి దీపాలు పెట్టిస్తారని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.



Next Story