డివైడర్ ఏర్పాటు చేయాలని స్థానికుల ధర్నా

by Dishafeatures2 |
డివైడర్ ఏర్పాటు చేయాలని స్థానికుల ధర్నా
X

దిశ, గరిడేపల్లి: డివైడర్ ఏర్పాటు చేయాలని స్థానికులు ధర్నా చేసిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గరిడేపల్లి మండల పరిధిలో ఉన్న అప్పన్న పేట గ్రామం కోదాడ - మిర్యాలగూడ ప్రధాన రహదారిపై ఉంది. ప్రధాన రహదారి వెళ్లే గ్రామాలలో ఏర్పాటు చేసిన విధంగా తమ గ్రామంలో కూడా ప్రధాన రహదారి మధ్యలో డివైడర్ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా రహదారిని నాలుగు లైన్లుగా విస్తరించి, సెంట్రల్ లైటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ యడవెల్లి చంద్రారెడ్డి డి, ఎం పి టి సి కడప ఇసాక్ , ఉప సర్పంచ్ విజయలక్ష్మి రాంబాబు యాదవ్, మాజీ సర్పంచ్ రామకృష్ణ, గొర్రెల కాపలాదారుల సంఘం మండల అధ్యక్షులు యరగోర్ల మదార్ యాదవ్, వై. బాల సైదులు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed