కార్యదర్శి పై గ్రామస్తుల ఆగ్రహం..!

by Batti.Sumithra |

గ్రామపరిశీలనకు వెళ్లిన ఎంపీడీవో ముందే జూమ్డా గ్రామస్థులు మంగళవారం కార్యదర్శి పనితీరు పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

కార్యదర్శి పై గ్రామస్తుల ఆగ్రహం..!
X

దిశ, కుబీర్ : గ్రామపరిశీలనకు వెళ్లిన ఎంపీడీవో ముందే జూమ్డా గ్రామస్థులు మంగళవారం కార్యదర్శి పనితీరు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో మురికి కాలువలు శుభ్రంగా లేవని, గ్రామ సమస్య పట్టించుకోరని స్థానికులు ఎంపీడీవో శ్రీనివాస్ దృష్టికి తీసుకువచ్చారు. గ్రామంలో ఉద్యోగం చేయడానికి వచ్చారా ఇలా వచ్చి అలా వెళ్తాడని తెలిపారు. స్థానికంగా పనిచేసే ఉపాధ్యాయుని పనితీరు గురించి మెచ్చుకున్నారు. ఎంపీడీవో శ్రీనివాస్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తానని, విధులు సక్రమంగా నిర్వహించేలా కార్యదర్శికి వార్నింగ్ ఇస్తానని గ్రామస్తులకు తెలిపారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పనులను, గ్రామచాయితీలోని రికార్డులను పరిశీలించారు.

Next Story