Vijayashanti: కేసీఆర్‌ పంటి చికిత్సకు ఖర్చు తగ్గే మార్గం చెప్పిన విజయశాంతి

by Dishanational2 |
Vijayashanti: కేసీఆర్‌ పంటి చికిత్సకు ఖర్చు తగ్గే మార్గం చెప్పిన విజయశాంతి
X

దిశ, వెబ్‌డెస్క్ : సీఎం కేసీఆర్ ఢిల్లీలో చేస్తున్న రైతు ధర్నాపై బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి సీరియస్ కామెట్స్ చేసింది. కేసీఆర్‌వి అన్నీ దొంగ దీక్షలు, రైతులకు బాయిల్డ్‌రైస్‌కి సంబంధం ఏంటని ప్రశ్నించింది. అలాగే వరి కుప్పల మీద రైతులు ప్రాణాలు పోతున్నా, కొనుగోలు కేంద్రాలను ఎందుకు మూసేశారు, వాటిని తెరవకుండా ఆలస్యం చేసి తక్కువ ధరకు దళారులు కొనుక్కోవాలని చూస్తున్నారా అంటూ మండి పడింది. మొన్న పన్ను పీకించుకోవడానికి ఢిల్లీకి వెళ్ళాడు.. అదే మొన్న పెట్టిన దీక్షలో కేసీఆర్ కూడా ఉంటే నీ పళ్ళు ఇక్కడే రైతులు పీకేసే వారు కదా ఖర్చు తప్పేది అంటూ ఫైర్ అయ్యింది. నీకు చేత కాకపోతే గద్దె దిగిపో కేసీఆర్ , రైతులకు బీజేపీ ప్రభుత్వం అండగా ఉందని పేర్కొంది.

Next Story