'మమ్మల్ని కూడా రెగ్యులరైజ్ చేయాలి.. లేకుంటే ఆందోళన చేస్తాం'

by Dishanational1 |
మమ్మల్ని కూడా రెగ్యులరైజ్ చేయాలి.. లేకుంటే ఆందోళన చేస్తాం
X

దిశ, బెజ్జుర్: విద్యావాలంటీర్లను రెగ్యులరైజ్ చేయాలని, లేకుంటే ఆందోళన చేస్తామని జిల్లా నిరుద్యోగ జేఏసీ అధ్యక్షులు దుర్గం వినోద్ తెలిపారు. బుధవారం బెజ్జూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కరోనా సమయంలో ప్రభుత్వ పాఠశాలలో ప్రాణాలకు తెగించి పాఠశాల కొనసాగినప్పటికీ విద్యావలంటీర్లను ప్రభుత్వం మరిచిపోయిందని.. ఆశా వర్కర్లకు, ఫీల్డ్ అసిస్టెంట్లకు తెలంగాణ ప్రభుత్వం రెగ్యులర్ చేసిన విధంగానే, విద్యావలంటీర్లను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.



Next Story

Most Viewed