- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
జిల్లాలో వైసీపీ నేతల దిగజారుడు చర్యలపై డీజీపీకి వర్ల రామయ్య లేఖ
దిశ, ఏపీ బ్యూరో : చిత్తూరు జిల్లా తంబళ్లపల్లిలో మిర్చి పంట తగులబెట్టిన ఘటనపై డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ రాశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన సీతి భూమిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డిలకు చెందిన మిరప పంట, డ్రిప్ వ్యవసాయ పైపులకు వైసీపీ నాయకుడు ఎస్ శంకర్ రెడ్డి అతని కుమారులు నిప్పుపెట్టి తగులబెట్టారని లేఖలో వర్ల రామయ్య ఆరోపించారు. రాజకీయంగా ఎదుర్కోలేక అధికార వైసీపీ నాయకులు వ్యవసాయ పంటలను, పరికరాలను నాశనం చేశారని ధ్వజమెత్తారు.
ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సీతి భూమిరెడ్డి, చంద్రశేఖర్రెడ్డిలు టీడీపీ అభ్యర్థి గెలుపులో కీలక పాత్ర పోషించారు. దీంతో వైసీపీ నేతలు ద్వేషం పెంచుకున్నారని లేఖలో వివరించారు. అందులో భాగంగానే మోటార్లు, డ్రిప్ ఇరిగేషన్ పైప్లైన్, స్టార్టర్లలకు నిప్పుపెట్టి టమాటా, మిర్చి పంటలను ధ్వంసం చేశారని లేఖలో ఆరోపించారు. ఈ అంశంపై బాధితులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకుండా పోలీసులు రాజీ కుదిర్చేందుకు వైసీపీ నాయకుల తరపున ఫిర్యాదుదారులతో బేరసారాలు ఆడుతున్నారని ఆరోపించారు. ఈ అంశంపై పోలీసులు తక్షణమే కేసు నమోదు చేసి నిందితులపై చర్యలు తీసుకోవాలని లేఖలో వర్ల రామయ్య విజ్ఞప్తి చేశారు.