స్కూళ్లలో విద్యార్థులకు వ్యాక్సిన్ డ్రైవ్‌లు షురూ

by Disha Web Desk |
స్కూళ్లలో విద్యార్థులకు వ్యాక్సిన్ డ్రైవ్‌లు షురూ
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి అన్ని స్కూల్స్ లో కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ లు నిర్వహించనున్నారు. 12 నుంచి 14 సంవత్సరాల వయస్సు కలిగిన వారికి మొదటి డోస్ ,15 నుంచి 17 సంవత్సరాల రెండవ డోస్ ఇవ్వనున్నారు. ప్రత్యేక టీమ్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నాయి. ఇదిలా ఉండగా రాష్ట్రంలో 35 కరోనా కేసులు నమోదయినట్లు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ లో వెల్లడించింది. రికవరీ రేట్ 99.39 శాతం ఉందని పేర్కొంది. 13,569 టెస్టులు చేసినట్లు ప్రకటించింది. ఇంత తక్కువ పాజిటివ్ కేసులు నమోదు కావటం ఈ రెండేళ్ల తరువాత ఇదే తొలిసారి.

Next Story

Most Viewed