ప్రగతిభవన్‌లో ఉగాది వేడుకలు.. కేసీఆర్ సమక్షంలో సంతోష్ కుమార్ శాస్త్రీ కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
ప్రగతిభవన్‌లో ఉగాది వేడుకలు.. కేసీఆర్ సమక్షంలో సంతోష్ కుమార్ శాస్త్రీ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఉగాది పండుగ వేడుకలు ప్రగతిభవన్‌ జనహితలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్యమంత్రి కేసీఆర్‌‌తో పాటు రాష్ట్ర మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రముఖ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రీ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పంచాంగం వినిపించి, రాష్ట్ర భవిష్యత్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ''వేములవాడ రాజన్న ప్రభ మళ్లీ వెలుగబోతున్నది. ఈ ఏడాది రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరుగబోతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ మంచి పాలన అందించనున్నారు. పంటలు అద్భుతంగా పండబోతున్నాయి. తెలంగాణ రైతులు రాజులు కాబోతున్నారు. ప్రజల ఆరోగ్యం బాగా ఉంటుంది. వాగ్దాటి గల వ్యక్తులకు రాజయోగం ఉంటుంది. దేశ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయి. అశ్వయుజ మాసంలో తుపానులు వచ్చే అవకాశం ఉంటుంది. పార్టీలు మారే రాజకీయ నేతల పరిస్థితి అగమ్యగోచరంగా ఉండబోతున్నది.'' అని సంతోష్ కుమార్ శాస్ట్రీ చెప్పారు.

Next Story