ఘోరం.. యువకుల డెడ్‌బాడీలను 20 కి.మీ ఈడ్చుకెళ్లిన లారీ

by Disha Web Desk 2 |
ఘోరం.. యువకుల డెడ్‌బాడీలను 20 కి.మీ ఈడ్చుకెళ్లిన లారీ
X

దిశ, వెబ్‌డెస్క్: కామారెడ్డి జిల్లా రామేశ్వరంపల్లి వద్ద ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. లారీ-బైక్ ఢీకొని ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో లారీ కింద పడిపోయిన ఇద్దరు యువకుల మృతదేహాలను దాదాపు 20 కిలోమీటర్ల మేర లారీ ఈడ్చుకెళ్లడం స్థానికులను భయబ్రాంతులకు గురిచేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. సదరు లారీ నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని గుర్తించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story

Most Viewed