నిజాం సాగర్ కాలువలో ఇద్దరు గల్లంతు..

by Dishafeatures2 |
నిజాం సాగర్ కాలువలో ఇద్దరు గల్లంతు..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నగరంలోని నిజాం సాగర్ డిస్ట్రిబ్యూటరి కాలువ 56 లో గురువారం ఇద్దరు వ్యక్తులు గల్లంతు అయ్యారు. కాలకృత్యాల తర్వాత కాలువలో శుభ్రం చేసుకునేందుకు దిగిన వారు అందులో పడి గల్లంతయ్యారు. ఈ ఘటన గురువారం నగరంలోని ఆరో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాబన్ సాహెబ్ పహడ్ వద్ద డైరీ ఫాం ప్రాంతానికి చెందిన శివాజీ(32) కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లి నీటిలో గల్లంతు అయ్యాడు. ఈ మేరకు స్థానికులు లోకల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసుల ఆదేశాలతో కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. కాగా ఒక వృద్ధుడి మృతదేహం లభ్యమైంది. ఇంకా యువకుడి కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయి. రాత్రి కావడంతో గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టారు. లభ్యమైన వృద్ధుడు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రాజక్కపేట్ వాసిగా గుర్తించారు. డైరీ ఫాం ప్రాంతంలో ఆలయానికి సంబంధించిన పశువుల కాపరిగా గుర్తించారు. ఈ మేరకు ఆరో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.



Next Story

Most Viewed