నల్లగొండలో దారుణం.. ఒకేసారి ఆత్మహత్య చేసుకున్న అన్నదమ్ములు

by Disha Web Desk 19 |
నల్లగొండలో దారుణం.. ఒకేసారి ఆత్మహత్య చేసుకున్న అన్నదమ్ములు
X

దిశ, నల్లగొండ: రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి నష్టపోయిన ఇద్దరు అన్నదమ్ములు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటన నల్లగొండ జిల్లా కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. నల్లగొండ మండలంలోని పెద్ద సూరారం గ్రామానికి చెందిన మార్త శ్రీకాంత్(40), వెంకన్న(35) ఇద్దరు అన్నదమ్ములు. వారి తండ్రి రామయ్య నల్లగొండ డీఈవో కార్యాలయంలో అటెండర్‌గా విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందారు. అంతకుముందే ఆయన కుటుంబం నల్లగొండలోని శ్రీనగర్ కాలనీలో స్థిరపడింది.

తన తండ్రి రిటైర్మెంట్ అవ్వగానే వచ్చిన సొమ్ము, వారు ఇతరులు దగ్గర అప్పులు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలు పెట్టారు. మొదట్లో లాభాలు గడించిన అనంతరం నష్టాలు చవిచూశారు. రోజులు గడుస్తున్నా కొద్ది దాదాపుగా రూ.3 కోట్ల మేర అప్పులయ్యాయి. దీనికి తోడు వడ్డీలు అధికమై, వ్యాపారానికి అప్పుల ఇచ్చిన వారి వేధింపులను భరించలేకపోయారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇద్దరు అన్నదమ్ములు ఫ్యాన్‌కు ఉరేసుకుని తనువు చాలించారు. చనిపోయిన విషయాన్ని ఆలస్యంగా గమనించిన కుటుంబీకులు వెంటనే టూటౌన్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి తెలిపారు.



Next Story

Most Viewed