రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి

by Disha Web Desk 13 |
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి
X

దిశ, శంకర్ పల్లి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటన శంకర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగపూర్ బైపాస్ రోడ్డుపై శుక్రవారం జరిగింది. శంకర్పల్లి ఎస్సై సంతోష్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని గుడిమల్కాపూర్ మార్కెట్‌లో టమాటాను దింపేసి, ఖాళీ లోడుతో వస్తున్న బొలెరో వాహనం సంగారెడ్డి నుంచి శంకర్పల్లి వైపు వస్తున్న బైక్‌ను ఢీకొంది. దీంతో బైక్ పై ఉన్న డి. నాగరాజు (34) అక్కడికక్కడే మృతి చెందాడు. బొలెరో డ్రైవర్ ఎం.డి నవీద్ ఖాన్ (38)కు తీవ్ర గాయాలు కావడంతో సంగారెడ్డిలోని శ్రీ బాలాజీ మెడికల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందాడు.


మృతుడు నాగరాజు సంగారెడ్డిలోని కనకదుర్గ చిట్ ఫండ్ లో క్యాష్ కలెక్షన్ ఇన్ ఛార్జ్‌గా పని చేస్తుండగా, మరో మృతుడు బొలెరో వాహనం డ్రైవర్ బీదర్ కు చెందిన వాడుగా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు శంకర్పల్లి ఎస్సై సంతోష్ రెడ్డి తెలిపారు.





Next Story

Most Viewed