ఏపీ నుంచి ఇద్దరికి పద్మ అవార్డులు

by Gantepaka Srikanth |   (  Updated:2026-01-25 14:03:46  IST  )

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించింది.

ఏపీ నుంచి ఇద్దరికి పద్మ అవార్డులు
X

దిశ, వెబ్‌డెస్క్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం ప్రభుత్వం పద్మ అవార్డులు(Padma Awards) ప్రకటించింది. ఈ ఏడాది మొత్తం 45 మందిని పద్మ అవార్డులకు ఎంపిక చేసింది. ఇందులో ఏపీ నుంచి ఇద్దరికి, తెలంగాణ నుంచి ఇద్దరికి మొత్తం నలుగురు తెలుగు వాళ్లకు పద్మశ్రీ వరించింది. సాహిత్యంలో వెంపటి కుటుంబ శాస్త్రికి పద్మశ్రీ(ఏపీ), గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్‌కు పద్మశ్రీ(ఏపీ), విజయ్ ఆనంద్‌కు పద్మశ్రీ(తెలంగాణ), గడ్డమానుగు చంద్రమౌళి పద్మశ్రీ(తెలంగాణ) అవార్డులు దక్కాయి. ఇదిలా ఉంటే.. ఈసారి తమిళనాడు, కేరళకు చెందిన వ్యక్తులకు కేంద్రం ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా మారుమూల, అత్యంత వెనుకబడిన ప్రాంతాలకు చెందిన వ్యక్తులకు ఈసారి ప్రాధాన్యత ఇవ్వడం విశేషం. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారిని ఈ ప్రతిష్టాత్మక అవార్డులకు ఎంపిక చేసింది. గతేడాదితో పోల్చితే ఈసారి పద్మశ్రీ అవార్డులను సగానికిపైగా తగ్గించింది.

READ MORE ....

Breaking: ఏపీ నుంచి నలుగురికి పద్మశ్రీ అవార్డులు

Next Story