Breaking: ఘోర ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం

by Disha Web Desk 2 |
Breaking: ఘోర ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే మరణించగా, మరో ఎనిమిది మందికి గాయాలు అయినట్లు సమాచారం. గమనించిన స్థానికులు క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. జిల్లాలోని ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామం వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. మృతులు శ్రీనివాస్, శ్రీకాంత్‌లు గుర్తించారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు.


Next Story

Most Viewed