- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సోషల్ మీడియా స్నేహం పేరుతో వివాహితకు రూ. కోటి టోకరా.. ఇద్దరు అరెస్ట్
సోషల్ మీడియా స్నేహం పేరుతో వివాహితను మోసగించిన మహేష్, స్వామిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. 571 గ్రాముల బంగారం స్వాధీనం.

దిశ, వెబ్ డెస్క్: ఓ వివాహితకు సోషల్ మీడియాలో స్నేహం పేరుతో పరిచయం అయిన ఇద్దరు వ్యక్తులు.. ఆమె నుంచి రూ. కోటి కొట్టేశారు. ఈ షాకింగ్ ఘటన బెంగళూరులోని కె.ఆర్. పుర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేయగా.. అరెస్టయిన వారిలో నిజామాబాద్కు చెందిన మహేష్ (36), అనంతపురం జిల్లాకు చెందిన స్వామి (40) ఉన్నారు వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని సీగేహళ్లికి చెందిన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి భార్యకు స్నాప్చాట్ (Snapchat) ద్వారా వీరు పరిచయమయ్యారు. సుమారు ఏడాదిన్నర కాలంగా సాగిన ఈ 'డిజిటల్ స్నేహం' చివరకు ఆమెను కోటిన్నర రూపాయల మేర నష్టపోయేలా చేసింది. నిందితులు ఆమె నుంచి సుమారు 1.6 కిలోల బంగారాన్ని కాజేసినట్టు పోలీసులు గుర్తించారు.
నమ్మించి వంచన - బ్లాక్మెయిలింగ్తో దోపిడి..
బాధితురాలు తన కుటుంబ సమస్యల వల్ల ఒంటరిగా ఉంటున్న విషయాన్ని ఆసరాగా చేసుకున్న నిందితులు, ఆమె నమ్మకాన్ని గెలుచుకున్నారు. మహేష్ తన రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నష్టాలు వచ్చాయని నమ్మించి ఆమె వద్ద నుంచి కిలోకు పైగా బంగారాన్ని దశలవారీగా తీసుకున్నాడు. మరో నిందితుడు స్వామి కూడా తన అవసరాల పేరిట కొంత నగదు, బంగారం వసూలు చేశాడు. బాధితురాలు తన బంగారం తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేయగా, వారి మధ్య ఉన్న చాటింగ్ను ఆమె భర్తకు చూపిస్తామని నిందితులు బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించారు. పోలీసుల దాడుల్లో నిందితుల నుంచి 571 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకోగా, మిగిలిన మొత్తాన్ని మహేష్ ఆన్లైన్ బెట్టింగ్లకు, జల్సాలకు ఖర్చు చేసినట్లు విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు.






